ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి జారీచేసిన ఉద్యోగ ప్రకటన (నం.02/2024) దరఖాస్తు గడువును టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు పొడిగించింది. మార్చి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశమిచ్చింది. తొలుత ఇచ్చిన గడువు గురువారం (మార్చి 14)తో ముగిసింది. చివరిరోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించారు. మరో రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కమిషన్ను కోరారు. ఈ నేపథ్యంలో కమిషన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. మరోసారి దరఖాస్తు గడువు పొడిగించబోమని స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్-1 ప్రకటనకు.. మార్చి 23 నుంచి కమిషన్ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాలని, కొత్తగా విద్యార్హతలు పొందిన ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్కు 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.