కరీంనగర్ పట్టణం, న్యూస్టుడే: బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఏటా పది వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఆయా రంగాల యాజమాన్యాలు, నిపుణులతో మార్చి 7న ఎంఓయూ కుదుర్చుకొనే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. మార్చి 6న కరీంనగర్లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన మేరకు హైదరాబాద్లో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయమై మార్చి 7న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే సమావేశంలో చర్చించి విధివిధానాలు ఖరారుచేస్తామన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చదివే వారికి అవసరమైన నైపుణ్యం కల్పించేలా, చదువు పూర్తికాగానే ఉద్యోగంలో చేరేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. నైపుణ్య వర్సిటీని రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకూ విస్తరిస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మార్చి 11, 12 తేదీల్లో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కార్యక్రమం కింద శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్, జిల్లా కేంద్రాలతోపాటు ఇతర పట్టణ స్థాయుల్లోనూ ఐటీని విస్తరించే దిశగా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.