* ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జతచేరతాయ్
* 2030కి సీఐఐ అంచనాలు
దిల్లీ: 2030 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు యూనికార్న్లు 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల)ను జత చేయగలవని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తన నివేదికలో పేర్కొంది. ఫలితంగా 5 కోట్ల కొత్త ఉద్యోగాలను ఇవి సృష్టించగలవని అంచనా వేసింది. 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8300 కోట్లు), అంత కంటే అధిక విలువ ఉన్న అంకురాలను యూనికార్న్లుగా పిలుస్తారు. మెకిన్సే అండ్ కంపెనీతో కలిసి ‘యూనికార్న్ 2.0: యాడింగ్ ద నెక్ట్స్ ట్రిలియన్’ పేరిట సీఐఐ విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు..
* 2029-30 కల్లా భారత్ 7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.581 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అప్పటికి యూనికార్న్లు 1 లక్ష కోట్ల డాలర్లను సమకూరుస్తాయి.
ఇ-కామర్స్, తదుపరి తరం ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్(ఎస్ఏఏఎస్), డిజిటల్ రంగాలు రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధికి ఉపకరిస్తాయి.
* 2011లో దేశంలో తొలి యూనికార్న్ ఆవిర్భవించింది. తదుపరి దశాబ్ద కాలంలోనే 100 యూనికార్న్లకు పైగా అవతరించాయి. 2024 జనవరి నాటికి దేశంలోని 113 యూనికార్న్ల మొత్తం విలువ 350 బి. డాలర్లు (సుమారు రూ.29.05 లక్షల కోట్లు)గా నిలిచింది.
* 100 యూనికార్న్లు పైగా ఏర్పడడం ఒక మైలురాయిలాంటిది. మొబైల్ ఇంటర్నెట్ విస్తరించడం, మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరగడం, నియంత్రణపరమైన మద్దతు, డిజిటల్కు అలవాటు పడ్డ యువ జనాభా అధికంగా ఉండడం.. ఇలా పలు అంశాలు ఈ మైలురాయికి దోహదపడ్డాయి.
* 100కు పైగా యూనికార్న్లు, లక్ష వరకు అంకురాలు కలిసి 2016-2023 మధ్య జీడీపీ వృద్ధికి 10-15% వాటాను అందించాయి.
* పట్టణాల్లోనే కాకుండా.. గ్రామాల్లోనూ వేగంగా డిజిటలీకరణ జరగడంతో మొత్తం కొత్త ఉద్యోగావకాశాల్లో 20-25 శాతాన్ని అంకురాలే అందిస్తాయి.
* 2015తో పోలిస్తే అంకురాల సంఖ్య 4,000 నుంచి లక్షకు చేరాయి. 2022-23లో అంకురాలు 140 బి.డాలర్ల (సుమారు రూ.11.62 లక్షల కోట్ల)ను ఆర్థిక వ్యవస్థకు అందించగలిగాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.