• facebook
  • whatsapp
  • telegram

NEET : నీట్‌ పీజీ-2024 జూన్‌ 23కు..

దిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) జూన్‌ 23కు మార్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ తేదీని జులై 7గా ప్రకటించింది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఫర్‌ హెల్త్‌ సైన్సెస్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌లతో ఎన్‌ఎంసీకి చెందిన పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్టు (పీజీఎంఈబీ) నిర్వహించిన సమావేశంలో నీట్‌ పీజీ-2024 తేదీని ముందుకు జరపాలని నిర్ణయించారు. ఆ ప్రకారం తుది ఫలితాలను జులై 15న ప్రకటిస్తారు. ప్రవేశాల కోసం ఆగస్టు 5 నుంచి అక్టోబరు 15 వరకూ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. నీట్‌ పీజీ-2024 అర్హతకు ప్రకటించిన కటాఫ్‌ తేదీని ఆగస్టు 15, 2024గానే ఉంచినట్లు ఎన్‌ఎంసీ తన ప్రకటనలో వివరించింది. సెప్టెంబరు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వైద్య పీజీ విద్యలో చేరేందుకు అక్టోబరు 21 చివరి తేదీ.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.