విజయవాడ: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ప్రవేశ పరీక్ష ఫలితాలు డిసెంబరు 12న విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. గుర్రం వంశీకృష్ణ(గుంటూరు), జకీర్ హుసేన్(కడప) టాపర్లుగా నిలిచారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్, 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు. ఆయన వెంట ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర, ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొ. కేసీ రెడ్డి ఉన్నారు. డిసెంబరు 5న తెలుగు రాష్ట్రాల్లో 638 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 85,760 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.