ఈనాడు, హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సంస్థలో కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరింది. దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మూడు వేల పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో సంస్థపై వేతనాల రూపంలో ప్రతి నెల రూ.8.40 కోట్లు, ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ లెక్కకట్టింది. ఆర్టీసీ ప్రతిపాదనల్లో మూడింట రెండొంతులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. దీంతో అత్యధికంగా కొత్త డ్రైవర్లకు వేతనాల కింద ఏడాదికి రూ.65.28 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. సిబ్బంది సర్వీసులో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తోంది. ఈ విభాగంలో దాదాపు 800 మందిని కండక్టర్లుగా తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ కారణంతో తాజా ప్రతిపాదనల్లో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించలేదని సమాచారం.
ఆర్టీసీలో ప్రస్తుతం 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో డ్రైవర్లు 14,747 మంది కాగా, కండక్టర్లు 17,410 మంది. సంస్థలోని అద్దె బస్సుల్లో ఆర్టీసీ నుంచి కండక్టర్ మాత్రమే ఉంటారు. ఆ బస్సుల్ని అద్దెకిచ్చే యజమాని నుంచే ప్రైవేట్ డ్రైవర్ ఉంటారు. ఆర్టీసీ ఇటీవల తీసుకుంటున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా అద్దెవే.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ ఆఫర్ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.