* మార్చి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
కొత్తగూడెం సింగరేణి: అంతర్గత నియామకాల ద్వారా 173 పోస్టుల భర్తీకి సింగరేణి యాజమాన్యం గురువారం (మార్చి 7న) ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 20 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జీఎం పర్సనల్ కె.బసవయ్య తెలిపారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే విజిలెన్సు విభాగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.
భర్తీచేయనున్న ఉద్యోగాలు: జూనియర్ మైనింగ్ ఆఫీసర్ 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ విభాగంలో మెకానికల్: 28, ఎలక్ట్రికల్: 21, సివిల్: 11, జూనియర్ ఆఫీసర్(ఆఫీస్అడ్మినిస్ట్రేషన్): 4, జూనియర్ ఆఫీసర్(అకౌంట్స్): 4, బయోకెమిస్ట్: 1, జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్: 12, జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్: 5.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.