* దరఖాస్తుల ఆహ్వానం
దిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఈ ఏడాది వివిధ విభాగాల్లో 97 మంది ఆఫీసర్లను నియమించుకోవాలని భావిస్తోంది. తన నియంత్రణ బాధ్యతలను వేగంగా, మరింత ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు ఈ పోస్టులు అవసరమని తెలిపింది. సాధారణ, న్యాయ, సమాచార సాంకేతిక, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్, పరిశోధన-అధికార భాష విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు అర్హులైన భారతీయులే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందులో సాధారణ విభాగంలోనే 62 మందిని నియమించుకోనుంది. 24 మందిని సమాచార సాంకేతిక విభాగంలో, అయిదుగురిని న్యాయ బృందంలో, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్, పరిశోధన-అధికార భాష విభాగాల్లో చెరో ఇద్దరిని ఎంపిక చేయాలనుకుంటోంది. ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉండనుంది. తొలి దశ ఆన్లైన్ పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఈ దశ పూర్తయితే రెండో దశలో మరో రెండు పేపర్లు ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది. ఎంపికైన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించి తుది ఎంపిక చేస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.