• facebook
  • whatsapp
  • telegram

Jobs: సింగరేణి కార్మికులకు 986 ఉన్నతస్థాయి పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలపై పనిచేస్తున్న విద్యావంతులైన యువ కార్మికులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందటానికి సంస్థ అవకాశం కల్పించింది. వివిధ విభాగాల్లో ఏర్పడిన 986 ఖాళీల భర్తీ కోసం సంస్థలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్‌ ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రెండు అంతర్గత నోటిఫికేషన్లను తాజాగా జారీ చేసింది. వీటిలో 204 అధికారి హోదా, 782 టెక్నీషియన్‌, ఇతర పోస్టులున్నాయి. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన సుమారు 16 వేల మంది యువకులలో అనేక మంది భూగర్భ గనులలో బదిలీ వర్కర్లుగా, జనరల్‌ మజ్దూర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి డిగ్రీ, పీజీ తదితర అర్హతలున్నాయి. ఖాళీగా ఉన్న 986 పోస్టులను వీరితో నింపాలని ఆదేశించినట్లు సంస్థ సీఎండీ బలరామ్‌ తెలిపారు. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ ఇటీవల మరో 599 పోస్టుల భర్తీకి రెండు ప్రకటనలు జారీ చేసింది. దీంతో సంస్థలో పనిచేసేవారికి 1585 ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశం లభించిందని బలరామ్‌ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.