• facebook
  • whatsapp
  • telegram

SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయనున్నారు. గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయి, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారు. రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌లు ముద్రించారు. విద్యార్థులు హాల్‌ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 2 వరకు కొనసాగనున్నాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.05 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.