నల్లకుంట, న్యూస్టుడే: టెట్ నిర్వహించకుండా డీఎస్సీ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 11న వేల మంది నిరుద్యోగులతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు.. టెట్ పరీక్ష కోసం ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో మార్చి 8న హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగులు, బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్, డీఎస్సీ నిర్వహించడానికి అభ్యంతరాలేంటో చెప్పాలన్నారు. మరోవైపు, 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ వేశారని, ఖాళీగా ఉన్న 24 వేల పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు సుధాకర్, రాజేందర్, నందగోపాల్, రాజ్కుమార్, జయంతి, ఉదయ్ పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.