* పాఠశాల విద్యాశాఖ వెల్లడి
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఏప్రిల్ 10, 12వ తేదీల్లో నిర్వహించిన టోఫెల్ రెడీనెస్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం (ఏప్రిల్ 12) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్ 10న టోఫెల్ ప్రైమరీ టెస్ట్ను 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు, 12న జూనియర్ టెస్ట్ను 6, 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు నిర్వహించినట్లు తెలిపింది. ‘ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థ పంపిన ప్రశ్నపత్రాలు, ఆడియో క్లిప్పులు ద్వారా వినడం, చదవడం విభాగాల్లో ఈ పరీక్షలు నిర్వహించాం. విద్యార్థుల ఓఎంఆర్లను ఈటీఎస్ స్కాన్ చేసి.. కొద్ది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి ఆ సంస్థ ధ్రువీకరణ పత్రాలు అందిస్తుంది’ అని వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.