దిల్లీ: దేశంలో అంబుడ్స్మన్లు లేని విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్చి 13 విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు నెల రోజుల్లోగా అంబుడ్స్మన్లను నియమించాలంటూ 2023 ఏప్రిల్లో యూజీసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు జారీచేసి దాదాపు ఏడాది కావస్తున్నా విశ్వవిద్యాలయాలు స్పందించకపోవడంతో తాజాగా 228 విశ్వవిద్యాలయాల పేర్లు ఉన్న జాబితాను యూజీసీ విడుదల చేసింది. వీటిలో 159 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 67 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి.
జాబితాలో ఆరు తెలుగు విశ్వవిద్యాలయాలు..
తెలుగు రాష్ట్రాల నుంచి మూడేసి చొప్పున ఆరు విశ్వవిద్యాలయాల పేర్లను యూజీసీ ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్-వరంగల్, నిమ్స్ మెడికల్ కాలేజీ-హైదరాబాద్, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ-బాసర. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ- విజయవాడ, క్లస్టర్ యూనివర్సిటీ-కర్నూలు, శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ- తిరుపతిలు ఉన్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ ఆఫర్ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.