ఎ.ఎన్.యు, న్యూస్టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు నిర్వహించిన ఆరో సెమిస్టర్ ఇంటర్నషిప్ మార్కుల ఫలితాలను వీసీ రాజశేఖర్ సోమవారం విడుదల చేశారు. మొత్తం 23,450 మంది పరీక్షలు రాయగా...23,240 మంది ఉత్తీర్ణులయ్యారని సీఈ రెడ్డి ప్రకాశరావు చెప్పారు. మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిద్ధయ్య, సీడీఈ సంచాలకులు డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!