• facebook
  • whatsapp
  • telegram

Schools: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

గంపలగూడెం, రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జిల్లాలోని గంపలగూడెం మండలం పెదకొమిర, రెడ్డిగూడెం మండలం  మద్దులపర్వలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు ఆర్‌.శైలజ, ఎ.వీరరాజు మార్చి 28న  తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో మే 22వ వరకు దరఖాస్తులు చేయవచ్చన్నారు. 25న ఆదర్శ పాఠశాలల రాష్ట్ర జేడీ వెంకటకృష్ణారెడ్డి దరఖాస్తుల స్వీకరణకు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన విద్యాలయాల నుంచి పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులన్నారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులున్నాయని, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తారని వెల్లడించారు. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారని, పది ఫలితాల అనంతరం వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారన్నారు. దరఖాస్తుతో పాటు ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.150లు రుసుం చెల్లించాలని చెప్పారు. http:///apms.ap.gov.in/apms/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నెలాఖరుతో ముగుస్తుందని, ఏప్రిల్‌ 21న ప్రవేశ అర్హత పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.