• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 20-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



2.  చీనాబ్‌ వంతెనపై మెము రైలు పరుగు!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై ఎనిమిది పెట్టెల మెము రైలు విజయవంతంగా పరుగు తీసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  తెలుగులో హల్లులతో తొలి పాప్‌అప్‌ పుస్తకం!

తెలుగు అక్షరాలను పిల్లలకు చేరువ చేయడానికి టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరు వినూత్న ప్రయోగం చేశారు. పుస్తకం తెరవగానే అక్షరాలు కదిలేలా రూపొందించారు. మాతృభాషపై మమకారం, తనకున్న డిజైనింగ్‌ నైపుణ్యంతో ‘కళాక్షరిక’ను రూపొందించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4.  నాటో సెక్రటరీ జనరల్‌గా మార్క్‌ రుట్టె!

నెదర్లాండ్స్‌ నేత మార్క్‌ రుట్టె నాటో కూటమి సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీపడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ యెహానిస్‌ బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  ఉప ముఖ్యమంత్రి ఓఎస్‌డీగా యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.