దిల్లీ: వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు (NEET Row) చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈక్రమంలోనే గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారి ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 (NEET-UG 2024) అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు (Revised Rank List) వెల్లడించింది.
మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష (NEET Re-Test) నిర్వహించగా.. 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు ఎన్టీఏ (NTA) అధికారులు వెల్లడించారు. ఆ రీ-ఎగ్జామ్ ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని నీట్ అధికారిక వెబ్సైట్లో ప్రచురించారు. ఈ ఫలితాల తర్వాత నీట్ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఎన్టీఏ వెల్లడించింది. సవరించిన స్కోర్ కార్డులను https://exams.nta.ac.in/NEET/లో చూసుకోవచ్చు. త్వరలోనే నీట్ కౌన్సెలింగ్ జరగనుంది.
నీట్-యూజీ 2024 పరీక్షా (Neet Exam) ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో కొందరు అభ్యర్థులు, పలు సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష రోజున కొన్ని కేంద్రాల్లో సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలపడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవ్వగా.. గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలాఉండగా.. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరిగిన ఆరోపణలు కూడా దుమారం రేపుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
సవరించిన స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.