• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ నిర్వహణలో చాలా లోపాలున్నాయి

* థర్డ్‌ పార్టీ రివ్యూలో పలు విషయాలు వెల్లడి

దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ‘నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష 2024’(NEET 2024)లో తీవ్ర నిర్వహణ లోపాలు ఉన్నట్లు ఎన్‌టీఏ థర్డ్‌పార్టీ రివ్యూలో గుర్తించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 4,000 కేంద్రాల్లో జరిగింది. వీటిల్లో 399 సెంటర్లను థర్డ్‌పార్టీ స్వయంగా పరిశీలించింది. కొన్నిచోట్ల పరీక్ష జరుగుతున్న గదుల్లో సీసీ కెమెరాలు లేవని.. ఉన్నా కొన్నిచోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. ఎన్‌టీఏ నిబంధనల ప్రకారం పరీక్ష గదిలో కచ్చితంగా రెండు కెమెరాలు ఉండాల్సిందే. దీంతోపాటు ఆయా సెంటర్లలో ప్రశ్నపత్రాలను భద్రపర్చినచోట గార్డుల రక్షణ లేని విషయాన్ని గమనించారు.

* ఈ రివ్యూను పరీక్ష జరిగిన రోజునే ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. 399 సెంటర్లలో 186 చోట్ల పనిచేస్తున్న రెండు కెమెరాలు లేవు. వాస్తవానికి వీటినుంచి వీటి లైవ్‌ఫీడ్‌ దిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లాల్సిఉంటుంది.

* రివ్యూ బృందం పర్యటించిన వాటిల్లో 68 చోట్ల ప్రశ్నపత్రం భద్రపర్చిన గదికి గార్డులను రక్షణగా నియమించలేదు. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం పంపిణీ చేసేవరకు కచ్చితంగా గార్డ్‌ రక్షణ ఉండి తీరాలి. 

83 సెంటర్లలో బయోమెట్రిక్‌ జాబితాలో ఉన్న సిబ్బంది.. విధుల్లో ఉన్నవారు వేర్వేరు కావడం గమనార్హం.

* పరీక్ష రోజున ఏ సెంటర్‌లోనూ మాల్‌ప్రాక్టిస్‌ వంటివి జరగకుండా చూసేందుకు ఈ రివ్యూను నిర్వహిస్తారు. దీనికింద పరిశీలకులను థర్డ్‌ పార్టీ నియమిస్తుంది. వీరు ఎన్‌టీఏ నిబంధనల అమలుతీరును ఎలాఉందో గమనించి నివేదిక ఇస్తారు. 

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందురోజు రాత్రే నీట్‌ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్‌కు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు వసూలుచేసినట్లు వెల్లడైంది. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.