* మొత్తం 327 పోస్టుల భర్తీ
ఈనాడు ప్రతిభ డెస్క్: సింగరేణి సంస్థలో మేలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ (నంబర్ 2/2024)కు సంబంధించి రాత పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6, 7వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని సంస్థ పేర్కొంది. రోజుకు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. త్వరలో హాల్టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో మొత్తం 327 పోస్టులను భర్తీ కానున్నాయి.
అందుబాటులో ప్రాథమిక కీ
సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి (ప్రకటన నంబర్ 1/2024) జులై 21న నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలు ఉంటే జులై 27వ తేదీలోగా తెలిపే అవకాశం కల్పించారు.