* టీజీపీఎస్సీ ప్రకటన జారీ
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. అర్హులైన అభ్యర్థులకు 1:2 ప్రకారం జూన్ 28 నుంచి జులై 2వ తేదీ వరకు హైదరాబాద్ టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఖాళీలు భర్తీ కానున్నాయి. గతేడాది జులై 8న రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
టీపీబీవో పోస్టుల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.