* ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రం గేట్లు బంద్
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా జూన్ 16న జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2024కు అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల నీట్ పరీక్షల నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ కొత్త నిబంధన విధించింది. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లను బిగిస్తున్నారు. ‘‘నో ఐడీ... నో ఎంట్రీ’’ విధానంలో భాగంగా హాల్టికెట్తోపాటు ఏదైనా గుర్తింపు కార్డు లేని వారిని లోనికి అనుమతించబోరు. దేశవ్యాప్తంగా జూన్ 16న 80 నగరాల్లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది. పరీక్షకు 30 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోరు. ఈ ప్రకటన ద్వారా సివిల్ సర్వీసులకు చెందిన 1,056 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు అందించే కీని https://pratibha.eenadu.net/ లో చూడవచ్చు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. చివరిగా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ అడ్మిట్కార్డుల కోసం క్లిక్ చేయండి
Study Material
‣ Polity
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.