విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Admissions: నిలిచిన డిగ్రీ ప్రవేశాల వెబ్‌ ఐచ్ఛికాలు

ఈనాడు, అమరావతి: డిగ్రీ ప్రవేశాలకు జులై 26న వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. ఉన్నత విద్యామండలి డిగ్రీకి సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని బీసీఏ, బీబీఏ కోర్సులకు ఫీజులు నిర్ణయం కాకపోవడంతో వెబ్‌ ఐచ్ఛికాలకు అవకాశం కల్పించలేదు. ఈ విషయం తెలియక విద్యార్థులు కంప్యూటర్ల ముందు పడిగాపులు కాశారు. చివరకు వెబ్‌సైట్‌లో త్వరలోనే వెబ్‌ ఐచ్ఛికాలు ఇస్తామని సమాచారం పెట్టారు.

Updated at : 27-07-2024 13:37:06

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం