ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్లో కోర్సులు, కళాశాలల ఎంపికకు శుక్రవారం (జులై 12) రాత్రి వరకు 1.23 లక్షల మంది వెబ్ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. ఐచ్ఛికాల నమోదుకు ఈ నెల 8 నుంచి 12 వరకు అవకాశం కల్పించారు. 13న ఐచ్ఛికాలు మార్పు చేసుకోవచ్చు. కొత్తగానూ పెట్టుకోవచ్చు. కళాశాలల ఫీజులు, అనుమతుల జారీలో ఆలస్యం కావడంతో ఐచ్ఛికాల నమోదు ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను సైతం వెబ్సైట్లో ఆలస్యంగా పెట్టడంతో 9 సాయంత్రం వరకు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. కౌన్సెలింగ్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినందున షెడ్యూల్ను పొడిగిస్తారేమోనని అభ్యర్థులు ఎదురు చూశారు. కానీ.. ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.