• facebook
  • whatsapp
  • telegram

AP TET: ఏపీ టెట్‌ షెడ్యూల్‌లో మార్పులు

* ఆగస్టు 3 వరకు దరఖాస్తు గడువు
 


AP TET 2024| అమరావతి: రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

సవరించిన టెట్ షెడ్యూల్‌: 

టెట్‌  నోటిఫికేషన్‌ విడుదల : జులై 2

పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆగస్టు 3 వరకు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు3 వరకు 

ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి అందుబాటులోకి

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జులై 22 నుంచి

పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20వరకు  (రెండు సెషన్లలో)

ప్రొవిజినల్‌ కీ : అక్టోబర్‌ 4న 

ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి

తుది కీ విడుదల: అక్టోబర్‌ 27

ఫలితాలు విడుదల: నవంబర్‌ 2న 



  ఏపీ  టెట్ స్టడీమెటీరియల్     

     

పేపర్ - I పేపర్ - II
 పరిసరాల పరిజ్ఞానం  సాంఘిక శాస్త్రం
 గణితం  జనరల్ సైన్స్
 లాంగ్వేజ్ - II (ఇంగ్లిష్)  గణితం
 లాంగ్వేజ్ - I (హిందీ)  లాంగ్వేజ్ - II (ఇంగ్లిష్)
 లాంగ్వేజ్ - I (తెలుగు)  లాంగ్వేజ్ - I (హిందీ)
 శిశువికాసం & పెడగోజీ  లాంగ్వేజ్ - I (తెలుగు)
   శిశువికాసం & పెడగోజీ
 పాత ప్రశ్నప‌త్రాలు
 నమూనా ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.