* అలంపూర్ తహసీల్దారును ప్రశ్నించిన హైకోర్టు
* ఆర్ఐతో సహా మళ్లీ హాజరుకావాలంటూ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: ఏపీలో చదివిన విద్యార్థినికి 18 ఏళ్లుగా తెలంగాణలో నివాసం ఉన్నట్లు ధ్రువీకరణపత్రం ఎలా జారీ చేశారని అలంపూర్ తహసీల్దారును నవంబరు 10న హైకోర్టు ప్రశ్నించింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో, ఇంటర్మీడియట్ కృష్ణా జిల్లాలో చదివినట్లుగా విద్యార్థినే స్వయంగా చెబుతుంటే అలంపూర్లో నివాసం ఉన్నట్లు ధ్రువీకరించడంపై విస్మయం వ్యక్తం చేసింది. మెడికల్ అడ్మిషన్లపై ఇదే హైకోర్టు నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. నివాస ధ్రువీకరణపత్రం సమర్పించినా తనకు అడ్మిషన్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన సింగోటం వెన్నెల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను తహసీల్దారు అమలు చేయకపోవడంతో గత విచారణలో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ పిటిషన్పై నవంబరు 10న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా.. తహసీల్దారు హాజరై తన న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. విద్యార్థిని నివాసాన్ని తనిఖీ చేసి ఆర్ఐ ధ్రువీకరించడంతోనే సంతకం చేసినట్లు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. పొరపాటు జరిగిందని చెప్పకుండా ఆర్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా జారీ చేశామని చెప్పడమేంటని ప్రశ్నించింది. డిసెంబరు 4న రెవెన్యూ ఇన్స్పెక్టర్తో సహా తిరిగి హాజరుకావాలని తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరిశోధనలతో వెలుగులు పంచుతూ..!
‣ కొలువుల జాతర.. రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.