* చివరి రోజు సర్వర్ మొరాయించినా గడువు పొడిగించని ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో సహాయ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు 46,150 దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తులు సమర్పించేందుకు సోమవారం చివరి రోజు. ఎక్కువ మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ప్రయత్నించడంతో సర్వర్ మొరాయించింది. ఫలితంగా చాలా మంది దరఖాస్తులు చేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఉన్నత విద్యామండలికి కొందరు ఫిర్యాదు చేశారు. కానీ గడువు పొడిగింపునకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు. చివరి రోజైన నవంబరు 20న 7 వేల దరఖాస్తులు అందాయి. రిజర్వేషన్ రోస్టర్పై కొంతమంది అభ్యర్థులు.. హైకోర్టును ఆశ్రయించారు. ప్రొవిజనల్ జాబితా జారీ ప్రక్రియను డిసెంబరు 4 దాకా చేపట్టవద్దని వర్సిటీలను న్యాయస్థానం ఆదేశించింది. రిజర్వేషన్ రోస్టర్పై వర్సిటీలు కౌంటర్ దాఖలు చేయనున్నాయి. ఆ తర్వాత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 801, ఆర్జీయూకేటీ లెక్చరర్లతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి.
బ్యాక్లాగ్ పోస్టులకు పరీక్షా?
వర్సిటీల్లో భర్తీ చేయనున్న సహాయ ఆచార్యుల బ్యాక్ లాగ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొనడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులకు ఎలాంటి పరీక్షలూ పెట్టకూడదంటున్నారు. ఈ పోస్టుల కోసం ఒక్కో దరఖాస్తుకు అదనంగా రూ.2 వేల రుసుం చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. సహాయ ఆచార్య పోస్టులన్నింటికీ ఒకే ఫీజు అని ప్రభుత్వం చెప్పగా... బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తులు చేస్తే అదనంగా చెల్లించాల్సి వచ్చిందని కొందరు అభ్యర్థులు చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.