ఈనాడు, హైదరాబాద్: పీజీ ఇంజినీరింగ్ సెట్(పీజీఈసెట్)లో నిర్వహించే పరీక్షల 19 సబ్జెక్టులను సాధ్యమైనంత వరకు కుదించాలని భావిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా దీనిపై సమీక్షించేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ప్రస్తుతం ఒక్కో సబ్జెక్టుకు ఒక ప్రశ్నపత్రం రూపొందించి, వేర్వేరుగా పరీక్షలు జరుపుతున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు కలిపి 17 వేల లోపే దరఖాస్తులు వస్తున్నాయి. అందులో వంద మంది లోపే పోటీపడుతున్న సబ్జెక్టులు 10 వరకు ఉన్నాయి. గత పీజీఈసెట్లోనే సబ్జెక్టులను కుదించాలని భావించినా సమయం లేక యథావిధిగా పరీక్షలు నిర్వహించారు. మళ్లీ వచ్చే మే నెలలో జరిగే ప్రవేశపరీక్షల నాటికైనా కుదించాలని విద్యామండలి భావిస్తోంది. ప్రతిపాదనలు అందజేసేందుకు జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ఛైర్మన్గా, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు కన్వీనర్గా, సభ్యులుగా ఆచార్య రామచంద్రం, లక్ష్మీనారాయణ, రవీంద్రారెడ్డితో కమిటీని నియమించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.