• facebook
  • whatsapp
  • telegram

AICTE: స్వయం అధ్యాపకులను అనుమతించాల్సిందే

* 10 క్రెడిట్ల ఆన్‌లైన్‌ కోర్సు పూర్తిచేస్తే చాలు

* సీఎస్‌ఈ, ఐటీ కొత్త కోర్సుల పాఠాలు బోధించవచ్చు

* జేఎన్‌టీయూహెచ్‌ వీసీకి ఏఐసీటీఈ ఆదేశం
 

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌కు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) షాక్‌ ఇచ్చింది. కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో పనిచేస్తూ కొత్త కోర్సులపై ‘స్వయం’ విద్య అభ్యసించిన అధ్యాపకులను కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సుల పాఠాలను బోధించేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. నేరుగా జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డికే లేఖ రాయడం చర్చనీయాంశమైంది. గతంలో స్పష్టమైన ఆదేశాలిచ్చినా పాటించడం లేదన్న అధ్యాపకుల ఫిర్యాదులతో ఏఐసీటీఈ స్పందించి ఆదేశాలిచ్చింది.
 

ఏమిటీ సమస్య?


ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్‌, ఐఓటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌, ఏఐ తదితర ఎమర్జింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోర్‌ బ్రాంచీలైన మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌తో పాటు ఈసీఈ తదితర బ్రాంచీలను మూసివేస్తూ, సీట్లను తగ్గించుకుంటూ డిమాండ్‌ ఉన్న కొత్త కోర్సుల్లో ఆయా కళాశాలలు సీట్లు పెంచుకుంటున్నాయి. రాష్ట్రంలో 1.10 లక్షల బీటెక్‌ సీట్లుంటే అందులో 70 వేల వరకు సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల సీట్లే ఉన్నాయి. దీంతో కొత్త కోర్సులకు అధ్యాపకుల కొరత తలెత్తింది. కోర్‌ బ్రాంచీల్లోని అధ్యాపకుల ఉద్యోగాలకూ ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు, ఉన్న కోర్‌ బ్రాంచీల అధ్యాపకుల మనుగడకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘స్వయం’ కోర్సులు లేదా ఇతర గుర్తింపు ఉన్న ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఎమర్జింగ్‌ కోర్సులపై 10 క్రెడిట్ల కోర్సును పూర్తిచేసిన వారిని కూడా కొత్త బ్రాంచీల పాఠాలు బోధించేందుకు అనుమతిస్తూ ఏఐసీటీఈ గత మార్చిలో నిర్ణయం తీసుకుంది. అదే విషయమై అన్ని విశ్వవిద్యాలయాలకు సమాచారం ఇచ్చింది. జేఎన్‌టీయూహెచ్‌ మాత్రం పలు అంశాలను పట్టించుకోకుండా సొంత నిబంధనలను విధిస్తోంది. ఐఓటీ కోర్సు పాఠాలు బోధించేందుకు తమను అనుమతించడం లేదని ఈసీఈ అధ్యాపకులు ఈనెల 5వ తేదీన ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గత మార్చిలో ఇచ్చిన 2023-24 అనుమతుల నియమావళిని పేర్కొంటూ జేఎన్‌టీయూహెచ్‌ వీసీకి ఏఐసీటీఈ లేఖ రాసింది. వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు సంబంధించి నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ జేఈఈ మెయిన్‌ విజయానికి కీలకాంశాలు

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ ఎయిమ్స్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.