ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2023 ఆన్లైన్ పరీక్షలు నవంబరు 26న జరగనున్నాయి. ఆ రోజు మూడు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం సుమారు 3.30 లక్షల మంది పోటీపడనున్నారు. గత సంవత్సరం 2.55 లక్షలు, 2021లో 2.31 లక్షల మందే దరఖాస్తు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరగడం విశేషం. ఈసారి మొత్తం అభ్యర్థుల్లో 1.17 లక్షల మంది అమ్మాయిలున్నారు. దేశంలోని దాదాపు 155 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు జరగనున్నాయి.
‣ ‘క్యాట్’ స్కోరుకు సన్నద్ధత!
‣ 'క్యాట్ 2023' సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.