గవర్నర్పేట, న్యూస్టుడే: విద్యార్థులకు డిజిటల్ రూపంలో పాఠ్యాంశాలు బోధించటంలో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం దేశానికే తలమానికంగా నిలిచిందని వర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పాత బోధనా పద్ధతులకు స్వస్తి పలికి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు వి బాక్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఏటా అవార్డులు అందిస్తోంది. ఈ అవార్డుల్లో.. కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. నవంబరు 24న దిల్లీలో నిర్వహించిన సదస్సులో నేషనల్ ఎడ్యుకేషనల్ ఫోరం ఛైర్మన్ అనిల్ సహస్ర బుద్దే, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆర్.ఎస్.శర్మ, వి బాక్సు సీఈవో నిర్మల్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కేఎల్యూ తరఫున ప్లానింగ్, డెవలప్మెంట్ అసోసియేట్ డీన్ కె.జ్యోతిష్య బ్రహ్మాచారి ఈ అవార్డు స్వీకరించినట్లు వీసీ జి.పార్థసారథివర్మ పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.