ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో పీజీ పూర్తి చేసి, ఆరేళ్లుగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులకు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పీహెచ్సీ, సీహెచ్సీల్లో పని చేసే వైద్యులు ఇన్ సర్వీసు కోటా ద్వారా పీజీలో ప్రవేశాలు పొందుతున్నారు. చదివే సమయంలో ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది. పీజీ పూర్తి చేసిన అనంతరం వీరు విధిగా అయిదేళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉండగా.. ఆ నిబంధనను ఉల్లంఘించిన 11 మందికి తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పీజీ చదివే సమయంలో తీసుకున్న జీతం రూ.20 లక్షలు తిరిగి చెల్లించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.