• facebook
  • whatsapp
  • telegram

Medical colleges: కొత్త వైద్య కళాశాలల్లో వైద్యుల నియామకాలకు 3 ప్రతిపాదనలు

 వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష

ఈనాడు, అమరావతి: కొత్తగా ఏర్పడే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రాకపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నీట్‌ ద్వారా ‘బి’ కేటగిరిలో సీట్లు పొందే బోధన సిబ్బంది పిల్లలకు ప్రభుత్వ ఫీజులో రాయితీ, ఒప్పంద విధానంలో చేరే ప్రొఫెసర్లకు నెలకు రూ.3 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు రూ.2.5 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రూ.2 లక్షల వరకు వేతనం ఇవ్వడం, గిరిజన ప్రాంతాల్లో ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహక మొత్తాన్ని అదనంగా ఇవ్వడం వంటి ప్రతిపాదనలపై మంగళగిరిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని డిసెంబరు 8 న నిర్వహించిన సమీక్షలో చర్చించారు. మంత్రి రజిని మాట్లాడుతూ వేలూరు సీఎంసీ (వైద్య కళాశాల)లో బోధకుల నియామకాలకు అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల హాజరు శాతం తగ్గుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు అవసరమైన ఇతర చర్యలను కూడా తీసుకోవాలని సూచించారు. విశాఖలోని విమ్స్‌లో స్పెషాలిటీ సేవలను మెరుగుపరచాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఏఐఏఎస్‌ఎల్‌లో కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

 ఎయిమ్స్‌ బీబీనగర్‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

 ఎన్‌ఐపీహెచ్‌ఎంలో రిసెర్చ్ ఫెలో ఖాళీలు 

‣ రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు 

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.