ఆచార్య కోదండరాం
ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా చూసేందుకు కృషి చేస్తానని తెజస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ సాధన పేరిట హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో డిసెంబరు 13న ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. పదేళ్లలో విద్యారంగం భ్రష్టు పట్టిందని, దాన్ని బలోపేతానికి అందరూ పాటు పడాలని కోరారు. గతంలో మూసివేసిన 6 వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని, ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందన్నారు. ఉపాధ్యాయ పోస్టులను 20 వేలకు పెంచి...అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని, అందుకు ఉపాధ్యాయ పదోన్నతులతో ముడిపెట్టవద్దని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఓయూ ఐకాస నాయకురాలు బాలలక్ష్మి, ఆచార్య అశోక్, రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రామ్మోహన్రెడ్డి, శ్రీనునాయక్, హరీశ్, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.