ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే మూడేళ్ల పాటు ఎంట్రప్రెన్యూరియల్ మైండ్సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఈఎండీపీ) అమలు చేసేందుకు అప్లౌటౌన్ ఇంటర్నేషనల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఆలోచనల అభివృద్ధితో పాటు ఆర్థిక నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అమెజాన్ రూపొందించిన ఏపీ ఎంట్రప్రెన్యూరియల్ మైండ్సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్స్పో-2023లో ప్రదర్శించిన అన్ని ప్రాజెక్టులతో కూడిన బుక్లెట్ను ఆవిష్కరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.