• facebook
  • whatsapp
  • telegram

DEESET: ఫలితాలొచ్చిన 6 నెలలకు డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌

* 20వ తేదీ నుంచి ప్రారంభం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి డీఈఈసెట్‌ ఫలితాలిచ్చిన ఆరు నెలల తర్వాత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. డిసెంబరు 20వ తేదీ నుంచి ఉత్తీర్ణులైన వారి ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఈ మేరకు పూర్తి కాలపట్టికను డీఈఈసెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి డిసెంబరు 18న  జారీ చేశారు. గత జూన్‌ 1వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. అదే జూన్‌ 14న ర్యాంకులను వెల్లడించారు. అంటే ఆరు నెలలు గడిచింది. విద్యార్థులు చాలా మంది కౌన్సెలింగ్‌ కోసం వేచిచూసి చివరకు ఇతర కోర్సుల్లో కూడా చేరారు. అయినా విద్యాశాఖ ఏమాత్రం స్పందించకుండా కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు కౌన్సెలింగ్‌ను ప్రారంభించింది. ఆ కోర్సులో ఎంత  మంది చేరతారన్నది వేచిచూడాలి.

కాలపట్టిక 

20వ తేదీ: ధ్రువపత్రాల పరిశీలన

22-27 వరకు: వెబ్‌ ఆప్షన్ల నమోదు

 30వ తేదీ: సీట్ల కేటాయింపు

 జనవరి 5వ తేదీలోపు: సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి

8 నుంచి: తరగతుల ప్రారంభం

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ గ్రూప్ 1, 2 సక్సెస్‌కు ముఖ్య సూచనలు

‣ సన్నద్ధతకు ముఖ్య సూచనలు!

‣ ఫ్యాషన్‌ కెరియర్‌లో ప్రవేశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.