• facebook
  • whatsapp
  • telegram

Students: 1న నింగిలోకి విద్యార్థినుల ఉపగ్రహం

* పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా పంపనున్న ఇస్రో

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్‌ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి జనవరి 1న చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం ద్వారా 600 కి.మీ. ఎత్తు కక్ష్యలోకి శాస్త్రవేత్తలు దీనిని చేర్చనున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. కళాశాలలో డిసెంబ‌రు 19న‌ జరిగిన కార్యక్రమంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ఉన్నికృష్ణ నాయర్‌కు వియ్‌శాట్‌ను అందించారు. కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లిజీ అబ్రహం ఆధ్వర్యంలో విద్యార్థినులు కిలో బరువుండే ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. భూమి ఉపరితలంపై యూవీ కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయడమే దీని లక్ష్యం. ఈ ఉపగ్రహం ఇచ్చే సమాచారాన్ని అధ్యయనం చేయడానికి కళాశాలలోనే గ్రౌండ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇస్రో శాస్త్రవేత్తల సూచనలతో 250 మంది విద్యార్థినులు, ముగ్గురు అధ్యాపకులు మూడేళ్లపాటు కృషి చేసి ఉపగ్రహాన్ని రూపొందించారు. రూ.30 లక్షలు ఖర్చు కాగా కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14.4 లక్షలు చొప్పున విడుదల చేశాయి.


 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.