వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిసెంబరు 20 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇతర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారులు ఆచార్య పి.మల్లారెడ్డి, డా.తిరుమలాదేవి కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రథమ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షలకు మొత్తం 1,83,942 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 8, అబ్జర్వర్స్ 122 మందితో పాటు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ డిప్లొమాతో ఎన్టీపీసీలో అవకాశాలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.