పటమట: హాల్ టికెట్లు రాలేదని నిరుద్యోగులు డిసెంబరు 28న లబ్బీపేట పశుసంవర్థక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. నవంబరు 20న 1,896 పశుసంవర్థక సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 19 వేల మంది దరఖాస్తు చేశారు. వీరికి డిసెంబరు 31న పరీక్ష ఉంది. డిసెంబరు 27 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. 500 మందికి హాల్టికెట్లు రాలేదు. ఫిర్యాదుల విభాగానికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో వివిధ జిల్లాల అభ్యర్థులు కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగం కోసం నెలలుగా చదువుతున్నామని, ఇప్పుడు తమ భవితపై ఆందోళన నెలకొందన్నారు. కొందరు రాత్రి వరకు పిల్లలతో పడిగాపులు కాశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.