* వాటిల్లో 122 చోట్ల మాత్రమే పాఠశాలలు అవసరం
* పాఠశాల విద్యాశాఖకు డీఈవోల నివేదిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 29 చోట్ల బడులు లేవు. జోగులాంబ గద్వాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం అన్ని పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల తప్పనిసరిగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి వివరాలు పంపాలని డీఈవోలను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా...వాటిల్లో 30 జిల్లాల్లో 257 చోట్ల ప్రభుత్వ బడులు లేవని తేలింది.
* అవసరం 122 చోట్లే...
మొత్తం 257 గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు లేకున్నా వాటిల్లో 122 చోట్ల మాత్రమే కొత్త బడులు అవసరమని డీఈవోలు నివేదించారు. మిగిలిన చోట్ల ప్రాథమిక పాఠశాలలకు వచ్చే పిల్లలు లేరని అభిప్రాయపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే మరోసారి క్షుణ్నంగా పరిశీలించి అక్కడ ఎందుకు అవసరం లేదో తెలపాలని కోరినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.