కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణ కోసం ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి20న తుది గడువని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల యువత bcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా జనవరి20న దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పీజీ ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు 30
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే పీజీ ప్రథమ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు జనవరి 30 వరకు ఉందని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్వీ.శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 3 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ ‘నిక్మార్’ నిర్మాణ రంగ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.