* దేశంలో రాష్ట్ర అబ్బాయిలది 4వ స్థానం
* 11వ స్థానంలో అమ్మాయిలు
* గ్రామీణ యువతపై అసర్ సర్వే-2023 వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల. దీన్ని కావాలనుకునే రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండటం విశేషం. దేశంలో ప్రతి వంద మంది అబ్బాయిల్లో ఆరుగురు టీచర్ కొలువు సాధించడం తమ లక్ష్యమని తెలపగా.. రాష్ట్రంలో 8.9% మంది ఆసక్తి కనబర్చారు. ఈ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని చెప్పినవారిలో రాష్ట్రానికి చెందిన అబ్బాయిలు దేశంలో 4వ, అమ్మాయిలు 11వ స్థానంలో నిలిచారు. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టిన వార్షిక విద్యాస్థితి నివేదిక(అసర్)-2023 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 14-18 వయసు గ్రామీణ యువతపై 28 రాష్ట్రాల్లో సర్వే చేశారు. టీచర్ ఉద్యోగం కావాలని అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో త్రిపుర(22.9%), రాజస్థాన్(20.4%), ఛత్తీస్గఢ్(9.9%), అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటున్న రాష్ట్రాల్లో రాజస్థాన్(33.6%), త్రిపుర(31.5%), హరియాణా(25.2%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సొంత జిల్లాలో, కుటుంబంతో ఉంటూ పనిచేయవచ్చని ఎక్కువమంది ఈ ఉద్యోగంపై ఆసక్తి కనబరచి ఉంటారని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.