• facebook
  • whatsapp
  • telegram

 AP TET: టెట్‌కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు

* విడివిడిగా టెట్‌, డీఎస్సీ నిర్వహణకు ప్రతిపాదన

* త్వరలో డీఎస్సీలో 6,000 పోస్టుల ప్రకటన

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్‌కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయిస్తారు. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. టెట్‌తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్సీలో 6వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, టెట్‌, డీఎస్సీకి జనవరి 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూల్‌ ప్రకటిస్తారు. మొదట టెట్‌ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌, డీఎస్సీలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.

డీఈడీ వారికే ఎస్జీటీ అర్హత

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 విడివిడిగా టెట్‌ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్‌ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. 6.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్‌ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్‌, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్‌, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉంది.

 


  డీఎస్సీ ఆంధ్రప్రదేశ్   


  స్కూల్ అసిస్టెంట్  
 

తెలుగు (కంటెంట్)
హిందీ (కంటెంట్)
ఇంగ్లిష్ (కంటెంట్)
బయాలజీ (కంటెంట్)
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
విద్యా దృక్పథాలు (కంటెంట్)
 సైకాలజీ (కంటెంట్)

  తెలుగు పండిట్   


 

కంటెంట్
మెథడాలజీ


  సెకండరీ గ్రేడ్ టీచర్స్   


 

లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్)
గణితం (మెథడాలజీ)
సోషల్ స్టడీస్ (కంటెంట్)
 సైన్స్ (కంటెంట్)
 విద్యా దృక్పథాలు
సైకాలజీ (కంటెంట్)

లాంగ్వేజ్ - II ఇంగ్లిష్ (కంటెంట్)

లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్)




మరింత సమాచారం... మీ కోసం

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.