• facebook
  • whatsapp
  • telegram

Education: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కొత్త తరహా బోధన

* క్యాంపస్‌ వెలుపల ప్రయోగాత్మక పరిశీలన

* వివిధ అంశాలను వివరణాత్మకంగా చెబుతున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కొత్త తరహాలో పాఠాలు నేర్చుకుంటున్నారు. తరగతి గదుల్లో కాకుండా బయటి ప్రపంచానికి వచ్చి పుస్తకాల్లో పాఠాలను అనుభవపూర్వకంగా అవగాహన చేసుకుంటున్నారు. వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులుగా పేరొందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు వీరికి పాఠాలు చెబుతున్నారు. ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ విధానం అమలులో భాగంగా ఆరుగురు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల నిపుణులు వర్శిటీలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రఖ్యాత పరిశోధనా సంస్థల్లో సేవలందించి, పలు ఆవిష్కరణల్లో పాలుపంచుకున్నారు. రెండు నెలల నుంచి వీరు ఉస్మానియాలోని ఇంజినీరింగ్‌, పీజీ విద్యార్థులకు వారి అనుభవాలను పాఠాలుగా బోధిస్తున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడు డాక్టర్‌ బషరత్‌ అలీ ఇంజినీరింగ్‌ విద్యార్థులను నగరంలోని ప్రముఖ కట్టడాలు, ఆధునిక నిర్మాణాల వద్దకు తీసుకెళ్లి వాటి నిర్మాణశైలిని చూపించి అవగాహన కల్పిస్తున్నారు.

ఉద్యోగావకాశాలు లభించాలని 

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యావిధానం ఉండాలని, చదువు పూర్తయిన వెంటనే వారికి ఉపాధి అవకాశాలు లభించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సీఈవోలు, పరిశోధన సంస్థల అధిపతులతో పాఠాలు చెప్పించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఉస్మానియా వర్శిటీ డాక్టర్‌ బషరత్‌ అలీ(సివిల్‌ ఇంజినీరింగ్‌), డాక్టర్‌ గంకిడి మధుసూదన్‌రెడ్డి (మెకానికల్‌ ఇంజినీరింగ్‌), డాక్టర్‌ ఉదయ్‌ బి.కృష్ణమూర్తి (బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌), డాక్టర్‌ ఎంఎస్‌ వెంకట రామయ్య(మైనింగ్‌ ఇంజినీరింగ్‌), శ్రీక్రిష్ణయ్య దయ్యాల, డాక్టర్‌ డి.వేణుగోపాల్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌)లను మూడునెలల క్రితం నియమించింది. ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ బోధన విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానానికి, వాస్తవ ప్రపంచానికి వారధిగా ఉందని బషరత్‌ అలీ తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పాఠాలు బాగానే అర్థమవుతున్నా.. క్షేత్రస్థాయికి తీసుకెళ్లి స్టీల్‌ ఇలావాడాలి.. పునాది ఇంత లోతుండాలి..సిమెంట్‌ కాంక్రీట్‌ నాణ్యత ఇలా చూడాలన్న అంశాలను పనులు జరుగుతున్న చోట్లకు తీసుకెళ్లి వివరిస్తే బాగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు.





మరింత సమాచారం... మీ కోసం

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.