హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే: ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు 1 నుంచి 15 వరకు ఉంటాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఉంటాయన్నారు. అనంతరం పరీక్షలపై ఇంటర్ విద్యాధికారి గోపాల్ వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో గణేష్, సీఐ శ్రీనివాస్రావు, ఈఎంహెచ్వో సాంబశివరావు, ఆర్టీసీ డీఎం ధరమ్సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.