* వాటి ముద్రణకు నిధులివ్వని ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ఫార్మెటివ్-4 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సప్లో పంపిస్తామంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు జరగనున్నాయి. ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. వారి రాజకీయ ప్రచారం కోసం విద్యాశాఖ నిధులు, పిల్లల ఫీజుల డబ్బులను వాడేసుకుంటోంది. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన విద్య సమ్మిట్ కార్యక్రమం కోసం ఇండియాటుడే ఛానల్కు రూ.4.20కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమంలో వచ్చేస్తుండడంతో పరీక్షలు తూతూమంత్రంగా మారాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇతర తరగతులకు ఏప్రిల్ 8 నుంచి 22 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. వీటికి మాత్రమే ప్రశ్నపత్రాలను ముద్రించి పంపిస్తామని విద్యాశాఖ పేర్కొంది. దీనికి నిధులు విడుదల చేయాలంటూ సమగ్ర శిక్షా అభియాన్ను కోరింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.