• facebook
  • whatsapp
  • telegram

Education: వాట్సప్‌లోనే ఫార్మెటివ్‌-4 ప్రశ్నపత్రాలు  

* వాటి ముద్రణకు నిధులివ్వని ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఫార్మెటివ్‌-4 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సప్‌లో పంపిస్తామంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు జరగనున్నాయి. ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. వారి రాజకీయ ప్రచారం కోసం విద్యాశాఖ నిధులు, పిల్లల ఫీజుల డబ్బులను వాడేసుకుంటోంది. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన విద్య సమ్మిట్‌ కార్యక్రమం కోసం ఇండియాటుడే ఛానల్‌కు రూ.4.20కోట్లు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమంలో వచ్చేస్తుండడంతో పరీక్షలు తూతూమంత్రంగా మారాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇతర తరగతులకు ఏప్రిల్‌ 8 నుంచి 22 వరకు సమ్మెటివ్‌-2 పరీక్షలు జరగనున్నాయి. వీటికి మాత్రమే ప్రశ్నపత్రాలను ముద్రించి పంపిస్తామని విద్యాశాఖ పేర్కొంది. దీనికి నిధులు విడుదల చేయాలంటూ సమగ్ర శిక్షా అభియాన్‌ను కోరింది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.