* ఆసిఫాబాద్ యువకుడికి గ్రూప్-4లో మొదటి స్థానం
* గ్రూప్-1 సాధనే లక్ష్యమన్న విజేత
ఆసిఫాబాద్, న్యూస్టుడే: లక్ష్యం నిర్దేశించుకున్నాడు.. దాన్ని సాధించాలని తపన పడ్డాడు. దానికి తగిన కృషిని జోడించాడు. అంతే.. అద్భుత విషయం అతని ఒడిలో వచ్చి వాలింది. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్కు చెందిన శ్రీరాం శివకృష్ణ విజయ గాథ ఇది. శ్రీరాం సత్యనారాయణ-వాణిశ్రీ దంపతుల ఇద్దరు కుమారుల్లో శ్రీరాం శివకృష్ణ పెద్దవాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఈఈఈలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఏడాదిపాటు ఇన్ఫోసిస్లో పనిచేశారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేశారు. ఇంట్లో ఉండే గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. గతేడు జరిగిన గ్రూప్-1 పరీక్షలో మెయిన్కు ఎంపికయ్యారు. పరీక్ష రద్దయినా నిరాశ చెందకుండా ఇతర పరీక్షలపై దృష్టి సారించారు. సింగరేణిలో ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షకు హాజరై రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంకు సాధించారు. గత కొంత కాలంగా కాసిపేట సింగరేణి గనిలో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్-4కు సిద్ధమై పరీక్ష రాశారు. 300 మార్కులకుగాను 220.458 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ‘యూట్యూబ్, గూగుల్ సహా వివిధ మాధ్యమాల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యా. గ్రూప్-1 సాధించాలనేదే నా లక్ష్యం’ అని శ్రీరాం శివకృష్ణ వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అణు శక్తి కేంద్రంలో ఉద్యోగావకాశాలు
‣ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో సైంటిస్ట్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.