ఈనాడు, హైదరాబాద్: గురుకులాల్లో కొత్త నియామకాలకు ముందుగానే అన్ని సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేయాలని తెలంగాణ ఎస్సీ గురుకుల టీచర్లు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ బాలరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరేళ్లుగా బదిలీలు, పదోన్నతులు చేపట్టకపోవడంతో సొసైటీల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నియామకాలు పొందే అభ్యర్థులను నాన్ఫోకల్ ప్రాంతాల్లో నియమించాలని డిమాండ్ చేశారు.
గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాల ఐకాస ఏర్పాటు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల ఉద్యోగ సంఘాలు కలిసి ఐకాసగా ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని ఐకాస ప్రతినిధి డాక్టర్ మధుసూదన్ ఫిబ్రవరి 11న ఓ ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న 20 వేల మంది టీచర్లలో దాదాపు 10 వేల మంది బదిలీలు, పదోన్నతులు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పదోన్నతులు, బదిలీల కోసం ఫిబ్రవరి 12న నల్లబ్యాడ్జీలతో నిరసన, 13న సామూహిక సెలవు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల భవిష్యత్తు కార్యాచరణపై ఫిబ్రవరి 13న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.