* పూర్తికాని నియామక ప్రక్రియ
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ల (ఎల్టీ) నియామక ప్రక్రియ ఏడేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో ఈసారైనా నిరీక్షణకు తెరపడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. గత ప్రభుత్వం.. 2017 డిసెంబరు 18న ఆరోగ్యశాఖలోని మూడు విభాగాల్లో 325 (తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు 95, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 127, డైరెక్టరేట్ ఆఫ్హెల్త్ 103) ఎల్టీ పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఈ నియామకాలకు రాష్ట్రవ్యాప్తంగా 11,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2018 మే 11న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు 9,192 మంది హాజరయ్యారు. ఆరు నెలల వ్యవధిలో పరీక్షల ప్రక్రియ పూర్తయి.. ఫలితాలు విడుదలవుతాయనుకున్న తరుణంలో తాత్కాలిక, పొరుగుసేవల్లో ఎల్టీలుగా పనిచేస్తున్న కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయాయి. దాదాపు అయిదేళ్ల తర్వాత.. భారాస ప్రభుత్వం సమస్యలను అధిగమించి 2023 జూన్ 8న మెరిట్ జాబితా విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులు పోస్టుల ఐచ్ఛికాలను ఎంచుకునే ప్రక్రియను పూర్తిచేసింది. తర్వాత ఎన్నికలు రావడంతో ఈ విషయం మరుగునపడింది. ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న సంబంధిత ఉద్యోగాలకు మరో 36 మంది ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోలేదని గుర్తించి ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ఇక ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో తుది ఫలితాలు వెలువడతాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు.
వేలల్లో ఖాళీలు
రాష్ట్రవ్యాప్తంగా ఎల్టీల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు జిల్లాకో వైద్యకళాశాల అందుబాటులోకి రాగా.. ఒక్కో కళాశాలకు నిబంధనల ప్రకారం 55 మంది చొప్పున 29 కాలేజీలకు 1595 మంది ఎల్టీలు అవసరం. ప్రస్తుతం 325 పోస్టులు భర్తీ చేసినా పూర్తిస్థాయిలో సేవలు మెరుగుపడే అవకాశం లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.