* టీఎస్పీఎస్సీ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. ఇటీవల మరో 60 గ్రూప్ -1 పోస్టులకు కొత్త ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం పోస్టులతో కలిపి త్వరలోనే గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్-I స్క్రీనింగ్ టెస్ట్
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.