కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: ఫిబ్రవరి 28 నుంచి జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి జి.జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 23న స్థానిక ఆయన కార్యాలయంలో పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు పరీక్ష కేంద్రాలకు అయిదు రోజుల ముందుగా వెళ్లి ఏర్పాట్లు సరిచూసుకోవాలని సూచించారు. ఫర్నీచర్, ఇన్విజిలేటర్లు, తాగునీరు, సీసీ కెమెరాలు, మూత్రశాలలు, లైటింగ్ మొదలైన వసతులను పరిశీలించి ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. హాల్టికెట్లు, నామినల్ రోల్స్, పరీక్షల సామగ్రిని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈసీ సభ్యులు కె.రవీందర్రెడ్డి, వి.ఆంజనేయరావు, కేదారిశ్వర్, కళాశాలల లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు శశిధర్శర్మ తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.